mani ratnam: ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

  • చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలింపు
  • ప్రత్యేక చికిత్సలు అందిస్తున్న వైద్యులు
  • ఆందోళనకు గురవుతున్న అభిమానులు

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. మణిరత్నానికి గుండెపోటు వచ్చింది. వెంటనే, ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించడంతో, ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీప్రముఖులు, అభిమానులు కోరుతున్నారు. కాగా, తెలుగు, తమిళం భాషల్లో పలు ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన వయసు 63 సంవత్సరాలు. మణిరత్నం సతీమణి ప్రముఖ సినీనటి సుహాసిని. 

  • Loading...

More Telugu News