sushanth: హిట్ కోసం సుశాంత్ మరో ప్రయత్నం!

  • మరో ప్రేమకథగా 'చి ల సౌ'
  • సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ 
  • ఆగస్టు 3వ తేదీన విడుదల

హీరోగా సుశాంత్ కొన్ని సినిమాలు చేశాడు .. అయితే అవేవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఆయన కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ, తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అలా తాజాగా ఆయన 'చి ల సౌ' సినిమాను చేశాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు .. సిరుని సినీ కార్పొరేషన్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, సుశాంత్ జోడీగా రుహాని శర్మ నటించింది. ప్రేమకథను కొత్తకోణంలో ఆవిష్కరించడం జరిగిందనీ, ఈ సినిమా తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే ఆశాభావాన్ని రాహుల్ రవీంద్రన్ వ్యక్తం చేశాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.     

  • Loading...

More Telugu News