sai madhav burra: క్రిష్ .. మహేశ్ కాంబినేషన్ సెట్ కాకపోవడానికి కారణమదే: రచయిత బుర్రా సాయిమాధవ్

  • క్రిష్ .. మహేశ్ బిజీగా వున్నారు 
  • ఇద్దరి కాంబినేషన్లో మూవీ ఉంటుంది 
  • చాలా గొప్ప కథ అది  

సినీ రచయితగా బుర్రా సాయిమాధవ్ కి మంచి పేరుంది. ఈ మధ్య కాలంలో ఆయన పనిచేసిన సినిమాలు ఘన విజయాలను సాధించాయి. అలాంటి సాయిమాధవ్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. 'మూడు నాలుగేళ్ల క్రితం క్రిష్ .. మహేశ్ .. మీరు కలిసి ఒక సినిమా చేయవలసి వుంది .. ఆ ప్రాజెక్టు ఎందుకు పట్టాలెక్కలేదు?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు బుర్రా సాయిమాధవ్ స్పందిస్తూ .. "మహేశ్ బాబుకి సమయం దొరికినప్పుడు క్రిష్ బిజీగా ఉండటం వలన, క్రిష్ కి సమయం చిక్కినప్పుడు మహేశ్ బిజీగా ఉండటమే అందుకు కారణం. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడానికి ఇంతకు మించిన కారణమేదీ లేదు. కానీ ఒక్కమాట మాత్రం చెప్పగలను .. ఎప్పటికైనా ఆ ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది. చాలా గొప్ప కథ అది .. అందువలన ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతాము" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News