china rajappa: ఏపీ మంత్రి చినరాజప్ప, ఆయన కుమారుడిపై జగన్ ఆరోపణలు

  • గ్రావెల్ మాఫియాతో వాళ్లిద్దరికీ ప్రమేయం ఉంది
  • ఈ జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయి
  • చంద్రబాబు పోలవరం వెళ్లేది కమీషన్ల కోెసమే

ఏపీ మంత్రి చినరాజప్ప, ఆయన కుమారుడిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఆనూరుమెట్ట గ్రావెల్ మాఫియా వెనుక చినరాజప్ప, ఆయన కుమారుడి ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఈ జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయని, పెద్దాపురం పరిసరాల్లో ఇటీవల జరిగిన ఆరు హత్యలే నిదర్శనమని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడి పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి యనమల వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చారని, చంద్రబాబు పోలవరం వెళ్లేది కమీషన్ల కోసమేనని జగన్ ఆరోపించారు.

More Telugu News