Mi A2: ఆకట్టుకునే ఫీచర్లతో షియోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

  • స్పెయిన్ లో షియోమీ ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌ విడుదల 
  • 3/4జీబీ తోపాటు 6జీబీ వేరియంట్లలో లభ్యం 
  • వచ్చేనెల 8న భారత మార్కెట్లోకి ఎంఐ ఎ2

షియోమీ కంపెనీ ఎంఐ ఎ2, ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ లను స్పెయిన్ మార్కెట్లో విడుదల చేసింది. వచ్చేనెల 8వ తేదీన ఎంఐ ఎ2ని మాత్రమే భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు షియోమీ ఇండియా అధిపతి మను కుమార్ జైన్ తెలిపారు. ఆకట్టుకునే ఫీచర్లతో 3/4జీబీ తోపాటు 6జీబీ వేరియంట్లలో ఎంఐ ఎ2 ఫోన్ ని విడుదల చేశారు.

3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,000 ఉండగా.. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,500గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.28,100గా ఉంది. కాగా, ఇండియాలో ఎంఐ ఎ2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.

షియోమీ ఎంఐ ఎ2 ప్రత్యేకతలు:

  • 5.99" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  • 3/4/6జీబీ ర్యామ్, 32/64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 12/20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3010ఎంఏహెచ్ బ్యాటరీ

  • Loading...

More Telugu News