Tollywood: నిర్మాతగా దిల్ రాజు... టాలీవుడ్ లో స్టార్ హీరో పక్కన జాన్వీ!

  • టాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తున్న బోనీ కపూర్
  • ఆమెను హీరోయిన్ గా తీసుకుంటామని అడిగిన దిల్ రాజు
  • మరికొన్ని రోజుల్లో స్పష్టత

తెలుగు సినీ ప్రేక్షకుల్లో అందాల తారగా చెరగని ముద్ర వేసి అకాలమరణం పొందిన శ్రీదేవి కుమార్తె, తాజాగా 'దఢక్'తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన జాన్వీ, ఓ తెలుగు చిత్రంలో స్టార్ హీరో సరసన నటించనున్నట్టు తెలుస్తోంది. శ్రీదేవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆమెతో ఎంట్రీ చేయించాలని బోనీ కపూర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 ఓ స్టార్ హీరోతో తాను నిర్మించే చిత్రంలో జాన్వీని పరిచయం చేయాలని భావిస్తున్న దిల్ రాజు, ఈ విషయాన్ని బోనీతో చర్చించారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జాన్వీ టాలీవుడ్ అరంగేట్రంపై మరింత స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

More Telugu News