Narendra Modi: 'మళ్లీ మోదీయే ప్రధాని' అంటున్న ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా

  • ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • అజెండా లేని విపక్షాలు
  • మోదీని ఓడించేందుకే చేతులు కలుపుతున్నారని విమర్శ

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కానున్నారని భారత బిగ్ బుల్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, విపక్షాలకు ఏ విధమైన అజెండా లేకుండా పోయిందని ఆరోపించారు. కేవలం నరేంద్ర మోదీని ఓడించడమే అజెండాగా వారు సాగుతున్నారని, ఈ క్రమంలో విజయం సాధించలేరని అన్నారు. బీజేపీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని, మళ్లీ ప్రధాని అయ్యేది మాత్రం ఆయనేనని పేర్కొన్నారు.

More Telugu News