Chandrababu: చంద్రబాబు ప్రోత్సాహంతో ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారు: అనిల్ కుంబ్లే ప్రశంసలు

  • మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అథ్లెటిక్ స్టేడియంలకు శంకుస్థాపన
  • సీకే నాయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమన్న కుంబ్లే
  • తొలి కెప్టెన్ గా భారత్ క్రికెట్ కు మార్గనిర్దేశం చేశారు

భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సందడి చేశారు. మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అథ్లెటిక్ స్టేడియం భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ తొలి కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుంబ్లే మాట్లాడుతూ, సీకే నాయుడు ఎంతో మంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సీకే నాయుడి సొంత ఊరిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తొలి క్రికెట్ కెప్టెన్ గా భారత క్రికెట్ కు ఆయన మార్గనిర్దేశం చేశారని అన్నారు.

  ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహంతో, ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆటలు ఆడేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఔత్సాహికులకు మంచి ట్రైనింగ్ కూడా కల్పిస్తున్నారని, వారిని భవిష్యత్ ఒలింపియన్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కుంబ్లేను మంత్రి కొల్లు రవీంద్ర సన్మానించారు.

More Telugu News