Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తొలిసారిగా త్రిష ద్విపాత్రాభినయం 
  • సంక్రాంతికి వైఎస్సార్ 'యాత్ర' 
  • ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ 
  • మళ్లీ వస్తున్న బాబూ మోహన్!

*  త్రిష తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 'మోహిని' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో మోహిని, వైశాలి అనే రెండు పాత్రల్లో తాను కనిపిస్తానని త్రిష చెప్పింది. ఇది హారర్ సినిమా కాదని, లవ్, రొమాన్స్ తో కూడిన ఎంటర్ టైనర్ అని ఆమె చెప్పింది.
*  మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందుతున్న 'యాత్ర' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ప్రస్తుతం 'సాహో' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ దీని తర్వాత ప్రేమకథా చిత్రంలో నటించనున్నాడు. 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఇందులో పూజా హెగ్డే నాయికగా నటిస్తుంది.  
*  ప్రముఖ హాస్య నటుడు బాబూ మోహన్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'బిచ్చగాడా మజాకా' చిత్రంలో ఆయన బిచ్చగాడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. 

More Telugu News