rajyasabha: రాజ్యసభలో రేపు మధ్యాహ్నం విభజన చట్టంపై చర్చ

  • రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వల్పకాలిక చర్చ
  • ఈ చర్చను ప్రారంభించనున్న సుజనా చౌదరి 
  • విభజన చట్టం అమలు, హోదాపై చర్చించనున్న నేతలు

ఏపీ పునర్విభజన చట్టంపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర విభజన చట్టంపై సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ఈ చర్చను టీడీపీ పార్లమెంటరీ నేత సుజనా చౌదరి ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై ఈ చర్చ జరుగుతుంది. కాగా, ఏపీ పునర్విభజన చట్టంపై రాజ్యసభలో చర్చకు రూల్ 267 కింద సుజనా చౌదరి నోటీసు ఇవ్వడం జరిగింది.

More Telugu News