మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన మోదీ.. రువాండాకు అద్భుతమైన బహుమతులు ఇవ్వనున్న పీఎం
- రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా దేశాల పర్యటనకు బయల్దేరిన మోదీ
- దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రత్యేక సమావేశం
రువాండా పర్యటన ముగించుకుని, రేపు ఉగాండాకు పయనమవనున్నారు మోదీ. గత 21 ఏళ్లలో ఉగాండాలో అడుగుపెడుతున్న తొలి భారత ప్రధాని మోదీనే. రువాండా, ఉగాండాలతో రక్షణ, వ్యవసాయ సంబంధిత ఒప్పందాలను ప్రధాని కుదుర్చుకోనున్నారు. అనంతరం ఉగాండా నుంచి ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అక్కడ జరగనున్న బ్రిక్స్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ సమావేశం కావడం ఇది మూడోసారి.