Hyderabad: ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లొస్తుండగా ప్రమాదం.. సివిల్స్ కు ప్రిపేరవుతున్న యువకుడి మృతి!

  • హైదరాబాద్ లో సంఘటన
  • డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం
  • అక్కడికక్కడే యువకుడి మృతి

తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగివస్తుండగా జరిగిన ప్రమాదంలో సివిల్స్ కు ప్రిపేరవుతున్న యువకుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పంజగుట్టలో తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న యువకుడు మహంత కుమార్ మృతి చెందాడు.

లాల్ బంగ్లా వద్ద అతని వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహంత్ మిత్రుడు నిఖిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మహంత్ కుమార్ ను తూర్పుగోదావరి జిల్లా వాసిగా గుర్తించారు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటూ అతను మెయిన్స్ కు ప్రిపేరవుతున్నాడు.

  • Loading...

More Telugu News