modi: ఒకరకంగా చెప్పాలంటే, బీజేపీ కన్నా కాంగ్రెస్సే బెటర్!: కేశినేని నాని

  • మోదీ నటనకు ఆస్కార్ అవార్డే ఇవ్వాలి
  • రాష్ట్రాన్ని విభజించిన ‘కాంగ్రెస్’ మోసం చేసింది
  • ఈ రోజున బీజేపీ పచ్చిమోసం చేసింది

మోదీ నటనకు ఆస్కార్ అవార్డే ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లోక్ సభలో ఆయన నటనేంటి, వెకిలి చేష్టలేంటి.. ప్రధాని పదవికి ఆ రోజున అప్రదిష్ట తీసుకొచ్చారు. ప్రతిఒక్కరూ అసహ్యించుకున్నారు. భారతదేశ ప్రధాని అంటే ప్రపంచంలో ఓ పేరు ఉంది. అలాంటిది, మోదీ వెకిలి చేష్టలు చేశారు.

ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టింది నేను. రైట్ టు రిప్లై కింద ప్రధానమంత్రి గారు ఆ రోజున ఎంతసేపు మాట్లాడారో, నేను కూడా అంతసేపు ప్రసంగించాలి. కానీ, నా హక్కును కూడా కాలరాస్తూ.. రెండు, మూడు నిమిషాల్లో నా ప్రసంగం ముగించమని ఆ రోజున స్పీకర్ అన్నారు. అరగంట సేపు మాట్లాడదామనుకున్నాం. కానీ, నా గొంతు నొక్కేశారు. నా గొంతు నొక్కడమంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాట్లాడనీయకుండా చేయడమే.. ఆ రోజున రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, ఈ రోజున బీజేపీ పచ్చిమోసం చేసింది. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ కన్నా కాంగ్రెస్సే బెటర్’ అని అన్నారు.

More Telugu News