shabbir ali: పార్లమెంట్ నుంచి నిన్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పరారయ్యారు?: షబ్బీర్ అలీ

  • బీజేపీకి ‘బీ’ టీమ్ టీఆర్ఎస్ 
  • కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అమ్ముడుపోయారు
  • ‘కాంగ్రెస్’, సోనియా గాంధీ వల్లే ‘తెలంగాణ’ ఏర్పడింది

టీఆర్ఎస్ ఎంపీలపై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ నుంచి నిన్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పరారయ్యారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు అవిశ్వాసానికి వ్యతిరేకమో, అనుకూలమో చెప్పలేదని విమర్శించారు. బీజేపీకి ‘బీ’ టీమ్ టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి అమ్ముడుపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వల్లే ‘తెలంగాణ’ ఏర్పడింది తప్ప, టీఆర్ఎస్, కేసీఆర్ వల్ల కాదని అన్నారు.

More Telugu News