samanta: సమంత, చైతూ సెట్స్ పైకి వెళ్లేది ఆ రోజునే!

  • నాగచైతన్య జోడీగా సమంత 
  • పెళ్లి తరువాత కలిసి చేస్తోన్న ఫస్టు మూవీ 
  • ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలు

'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత .. చైతూ యూత్ హృదయాలను దోచేశారు. ఈ సినిమా నుంచే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలై భార్యాభర్తలయ్యేలా చేసింది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ వస్తోన్న ఈ జంటకు, తాజాగా ఒక మంచి కథ దొరికేసింది. దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో సమంత .. చైతూ ఓకే చెప్పేశారు.ఈ సినిమాలోనూ ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం. సాహు .. హరీశ్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఆ తరువాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పోసాని కృష్ణమురళి .. రావు రమేశ్ .. అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది.

More Telugu News