swamy agnivesh: స్వామి అగ్నివేష్ ఒక ద్రోహి: జార్ఖండ్ మంత్రి

  • అగ్నివేష్ ది స్వయం ప్రేరేపిత దాడి
  • ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నారు
  • కశ్మీర్ వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంటారు

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై జార్ఖండ్ లో బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సబంధించి జార్ఖండ్ రాష్ట్ర మంత్రి సీపీ సింగ్ కొత్త భాష్యం చెప్పారు. అగ్నివేష్ పై ఎవరూ దాడి చేయలేదని... ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పారు. ఇది ముమ్మాటికీ స్వయం ప్రేరేపిత దాడి అని అన్నారు. అగ్నివేష్ ఓ ద్రోహి అంటూ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని, కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంటారని అన్నారు. సీపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News