విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం: విష్ణుకుమార్ రాజు
- టీడీపీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం బీజేపీకి లేదు
- ఏపీకి చేసినవన్నీ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వివరిస్తాం
- చర్చ సందర్భంగా ఏపీకి ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉంది
బీజేపీ, టీడీపీల గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని విష్ణు తెలిపారు. టీడీపీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చడం కూడా తప్పని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు కేవలం ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చారని... ఏపీకి అంతకు మించి ఇస్తున్నామని తెలిపారు.