Marriage: ఇంత వెరైటీయా?... భారీ పంజరంలో ఎగురుతూ పెళ్లి మండపానికి వచ్చిన వధూవరులు... వీడియో!

  • వెరైటీగా వివాహ మండపానికి వచ్చిన వధూవరులు
  • విద్యుత్ పంజరంలో వారిని తీసుకువచ్చిన గద్ద
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ఇటీవలి కాలంలో వెరైటీ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. గుర్రాలపై ఊరేగింపులు, పెళ్లి పల్లకీల స్థానంలో హెలికాప్టర్లు ప్రవేశించాయి. ఇటీవలే ఓ కొత్త జంట బుల్డోజర్ ఎక్కి విహరించింది కూడా. తాజాగా మరో జంట ఇంకాస్త వెరైటీగా కల్యాణ మండపంలోకి ప్రవేశించగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి ఓ విద్యుత్ పంజరంలో వారిద్దరూ వచ్చారు. ఆకాశం నుంచి వారిద్దరినీ ఓ గద్ద తీసుకువస్తున్నట్టుగా ఓ క్రేన్ సాయంతో వారిని కిందకి దించారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయగా, వారి ఎంట్రీకి వధూవరులు 'వహ్... ఏం వెరైటీ' అంటున్నారు. వారు దిగుతున్న సమయంలో "బహారో ఫూల్‌ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..." పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండటం ఈ వీడియోకు మరింత అందాన్ని తెచ్చింది. దాన్నోసారి మీరూ చూసేయండి.

More Telugu News