India: టీమిండియా విజయ లక్ష్యం 323 పరుగులు!

  • కుల్దీప్‌ యాదవ్‌కు 3 వికెట్లు
  • తలో వికెట్‌ పడగొట్టిన ఉమేశ్, పాండ్యా, చాహెల్‌
  • శతకం బాదిన జోయీ రూట్‌

లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా జరుగుతోన్న భారత్‌-ఇంగ్లండ్‌ రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జేసన్‌ రాయ్‌ 40, జానీ బెయిర్‌స్టో 38, మోర్గాన్‌ 53, జోయీ రూట్ 113 (నాటౌట్), బెన్‌ స్టోక్స్‌ 5, జోస్‌ బట్లర్‌ 4, మోయీన్‌ అలీ 13, డేవిడ్‌ విల్లే 50 (రనౌట్‌) పరుగులు చేశారు.

ఎక్స్‌ట్రాల రూపంలో ఆ జట్టుకు 4 పరుగులు వచ్చాయి. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చాహెల్‌లకు తలో వికెట్‌ దక్కాయి. ఇప్పటికే మూడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ గెలిచిన భారత్‌.. ఈ మ్యాచులో గెలిస్తే సిరీస్‌ కైవసం అవుతుంది.   

More Telugu News