surya: పొల్లాచ్చికి బయలుదేరనున్న సూర్య

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • ప్రతినాయకుడి పాత్రలో ఆర్య 
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్

ప్రస్తుతం సూర్య .. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు .. సూర్యకి ఇది 37వ సినిమా. ఇటీవలే లండన్ లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేశారు. రెండవ షెడ్యూల్ ను 'పొల్లాచ్చి'లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడిగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమాలో సూర్యను ఎదుర్కునే విలన్ గా 'ఆర్య' చేస్తుండటం విశేషం. ఆయన పాత్రను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారని అంటున్నారు. ఇక మోహన్ లాల్ .. బొమన్ ఇరాని .. అల్లు శిరీష్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. గతంలో సూర్యతో 'బ్రదర్స్' .. 'వీడొక్కడే' వంటి విభిన్నమైన సినిమాలను కేవీ ఆనంద్ చేశాడు. అందువలన తాజా ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి వుంది. 

More Telugu News