Chandrababu: ప్రతి యేటా 50 కోట్ల మొక్కలు నాటుదాం: చంద్రబాబు

  • రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం మాత్రమే ఉంది
  • ఈ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాం
  • ఈ ఏడాదిలో 25 కోట్ల మొక్కలు నాటుదాం

ఇకపై ప్రతి యేటా రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల మొక్కలు నాటాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు నూజివీడులో నిర్వహించిన 'వనం-మనం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 26 శాతం పచ్చదనం మాత్రమే ఉందని... 2029 నాటికి 50 శాతం పచ్చదనాన్ని పెంచుదామని చెప్పారు. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటామని... ఈ ఏడాదిలో 25 కోట్ల మొక్కలు నాటుదామని తెలిపారు. వనం-మనం కార్యక్రమం సందర్భంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో చంద్రబాబు మొక్కలు నాటారు. చెట్లను కాపాడతామంటూ విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. 

  • Loading...

More Telugu News