sudheerbabu: సుధీర్‌బాబు 'నన్ను దోచుకుందువటే' టీజర్‌ విడుదల!

  • సుధీర్‌బాబు సరసన నభా నటేశ్
  • కంపెనీ మేనేజర్ పాత్రలో హీరో 
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా హీరోయిన్

సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా నుండి కాసేపటి క్రితం టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్ గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో నటించినట్లు తెలుస్తోంది. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ నటి నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. నాజర్, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అజనీష్ సంగీతాన్ని సమకూర్చాడు.

More Telugu News