Anushka Sharma: గ్యాలరీ నుంచి కోహ్లీ, ధావన్‌లను ప్రోత్సహించిన అనుష్క శర్మ, అయేషా

  • ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా
  • నిన్న జరిగిన తొలి వన్డేలో విజయం
  • కోహ్లీ, ధావన్‌లకు ఫ్లయింగ్‌ కిస్‌లు

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా నిన్న జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో బ్యాటు ఝుళిపిస్తోంటే ఆయన భార్య అనుష్కశర్మ విసిరిన ఫ్లయింగ్‌ కిస్‌లకు సంబంధించి వీడియో అలరిస్తోంది. ఆమె పక్కనే శిఖర్‌ ధావన్‌ భార్య అయేషా కూడా ఉంది. టీమిండియా విజయం సాధించగానే వారిరువురూ గ్యాలరీలో నిలబడి చప్పట్లు కొట్టారు. కోహ్లీ, ధావన్‌లకు ఫ్లయింగ్‌ కిస్‌లు వదిలారు. అనంతరం అనుష్క శర్మ మైదానంలోకి వచ్చి మరీ కోహ్లీని కౌగిలించుకుంది.  

కాగా, ఇటీవలే ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా రేపటి వన్డేలోనూ గెలిచి సిరీస్‌లో పై చేయి సాధించాలని భావిస్తోంది. రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

More Telugu News