Vijayawada: పదే పదే మంచినీళ్లు కావాలంటూ వచ్చి... నమ్మకంగా మాట్లాడి.. లోబరచుకుని ద్రోహం!

  • విజయవాడ చిట్టినగర్ పరిధిలో ఘటన
  • క్రికెట్ ఆడేందుకు వచ్చి యువతితో పరిచయం
  • మత్తుమందిచ్చి అత్యాచారం

ఓ స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడి కన్ను, పక్కనే ఉన్న ఇంట్లోని యువతిపై పడింది. ఆట మధ్యలో మంచినీళ్లు కావాలంటూ ఇంటికి వెళుతూ మాటలు కలిపి, పరిచయం పెంచుకుని, నమ్మించి తీసుకెళ్లి, ఆపై మత్తుమందిచ్చి అత్యాచారం చేయడంతో పాటు వీడియో తీసి వేధించాడు. ఓ సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ వాస్తవం, విజయవాడ పరిధిలోని చిట్టినగర్ లో జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు పొట్నూరి లక్ష్మణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్ష్మణ్ తన స్నేహితులతో కలసి ఓ పాఠశాల గ్రౌండ్ కు వచ్చేవాడు. ఈ క్రమంలో మైదానం పక్కనే ఉంటూ, అక్కడి మరో స్కూల్ లో పనిచేస్తున్న ఓ యువతి (20)పై లక్ష్మణ్ కన్ను పడింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నయ్యతో కలిసుంటోందా యువతి. ఈ క్రమంలో మంచినీళ్లతో ప్రారంభమైన వారి పరిచయం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం, మెసేజ్ ల వరకూ వెళ్లింది.

ఈ క్రమంలో తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి, వారు బయటకు వెళ్లారని అంటూ, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేసి వీడియో తీశాడు. బయటకు చెబితే, వీడియోలు బయట పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై పలుమార్లు సినిమాలకు, షికార్లకూ తిప్పి ఆమెను అనుభవించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తేగానే తప్పించుకోవడం మొదలు పెట్టాడు. కనిపించకుండా పోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

More Telugu News