Columbia: క్షణాల్లో నేలమట్టమైన భారీ వంతెన... వీడియో!

  • సాంకేతికంగా నిర్మాణ పనులు
  • 200 కిలోల బాంబులతో పేల్చివేత
  • కొలంబియాలో ఘనత

నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయన్న కారణంతో కొలంబియాలో ఓ బ్రిడ్జ్ ని అధికారులు కూల్చివేశారు. ఇందుకోసం 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను ఉపయోగించారు. బ్రిడ్జి పునాదుల నుంచి పైవరకూ బాంబులను అమర్చి, వాటిని పేల్చగా, పెద్ద శబ్దం చేస్తూ ఆ వంతెన కుప్పకూలిపోయింది. చుట్టూ తిరిగి వెళ్లాలంటే రెండు గంటల సమయం తీసుకునే రెండు ప్రాంతాల నడుమ ఓ లోయలో దీన్ని నిర్మిస్తున్నారు.

చిరాగరా కానియన్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఓ ప్రమాదంలో పది మంది కార్మికులు మృతి చెందారు. 2017 జనవరిలో జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతూనే ఉండటం గమనార్హం. 446 మీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జ్ డిజైన్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించిన అధికారులు దీన్ని పేల్చి వేయాలని నిర్ణయించారు.

More Telugu News