england: ఇంగ్లండ్‌లో షాపింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోన్న కోహ్లీ, అనుష్క శర్మ

  • నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో టీమిండియా
  • రేపటి నుంచి వన్డే సిరీస్‌
  • ఇటీవలే ఇంగ్లండ్‌ వెళ్లిన అనుష్క శర్మ
  • విరుష్క వీడియోలు వైరల్

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, సినీనటి అనుష్క శర్మల జంట ఎక్కడ కనపడ్డా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20 గెలిచిన టీమిండియా రేపటి నుంచి నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. ఇటీవలే అనుష్క శర్మ కూడా ఇంగ్లండ్‌ వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నాటింగ్‌హమ్‌లో తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ వీధుల్లో నడుచుకుంటూ వెళుతుండగా తీసిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అక్కడి తమ స్నేహితులతో కలిసి వారిరువురూ షాపింగ్ చేస్తూ హాయిగా గడుపుతున్నారు. కాగా, టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య మొదటి వన్డే రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. 

More Telugu News