vijay devarakonda: ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా'
  • రాజకీయ నేపథ్యమే ప్రధాన కథాంశం 
  • కథానాయికగా మెహ్రీన్

యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టాక్సీవాలా' సిద్ధంగా వుంది. ఇక 'గీత గోవిందం' చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' అనే సినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ పాత్ర ఎలా వుండనుందా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇటీవల మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' భారీ విజయాన్ని సాధించింది. అందువలన 'నోటా' కూడా విజయ్ దేవరకొండకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే.       

More Telugu News