KTR: శభాష్ ఏపీ .. అభినందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్

  • ఈవోడీబీలో ఏపీకి అగ్రస్థానం
  • రెండో స్థానంలో తెలంగాణ
  • అధికారుల వల్లే సాధ్యమైందన్న కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్రం తాజాగా ప్రకటించిన సులభతర వాణిజ్యం (ఈవోడీబీ)లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలవడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. 0.09 శాతం తేడాతో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంకును కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల వల్లే మంచి ర్యాంకు సాధ్యమైందని ట్వీట్ చేశారు. ప్రపంచబ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సంయుక్త కార్యక్రమంలో ఈవోబీడీ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, తెలంగాణ రెండు, హరియాణా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News