vishal: రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న విశాల్

  • విశాల్ హీరోగా 'సెండై కోళి 2'
  • దర్శకుడిగా లింగుస్వామి 
  • దీపావళికి థియేటర్స్ కి      

అటు తమిళంలోనూ .. ఇటు తెలుగులోను మాస్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఇటీవల ఆయన చేసిన 'ఇరుంబు తిరై' తమిళనాట ఘన విజయాన్ని సాధించింది. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తరువాత విశాల్ నుంచి 'సెండై కోళి 2' రానుంది.

లింగుస్వామి దర్శకత్వంలో గతంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'సెండై కోళి' (పందెం కోడి)కి ఇది సీక్వెల్. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో విశాల్ వున్నాడు .. ఈ సినిమాకి ఆయనే నిర్మాత. తమిళనాట దీపావళికి సూర్య .. విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అయినా పోటీని లెక్కచేయకుండా విశాల్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్నాడు .. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.    

More Telugu News