england: ఇంగ్లండ్‌తో చివరి టీ20... టీమిండియా ముందు భారీ లక్ష్యం

  • జాన్సన్‌ రాయ్‌ 67, జోస్‌ బట్లర్‌ 34, అలెక్స్‌ హేల్స్‌ 30 పరుగులు
  • హార్దిక్‌ పాండ్యాకు 4 వికెట్లు
  • ఇంగ్లండ్‌ స్కోరు 198/9

బ్రిస్టల్‌ వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఇంగ్లండ్‌ భారీ లక్ష్యాన్నిచ్చింది. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడి 198 పరుగులు చేశారు. జాన్సన్‌ రాయ్‌ 67, జోస్‌ బట్లర్‌ 34, అలెక్స్‌ హేల్స్‌ 30, మోర్గాన్‌ 6, బెన్‌స్టోక్స్‌ 14, జానీ బైర్‌స్టో 25, డేవిడ్‌ విల్లే 1, క్రిస్‌ జోర్డాన్‌ 3, ప్లంకెట్‌ 9, అదిల్‌ రషీద్‌ 4 పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 4 వికెట్లు తీయగా.. సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్‌ ఛాహర్‌, ఉమేశ్‌ యాదవ్‌లకి తలో వికెట్‌ దక్కాయి. ఇంగ్లండ్‌కి ఎక్స్‌ట్రాల రూపంలో 5 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.   

More Telugu News