అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య... నిందితుడిని పట్టిస్తే 10 వేల డాలర్ల బహుమతి!
- కన్సాస్ రెస్టారెంట్ లో ఘటన
- రివార్డు ప్రకటించిన అమెరికా పోలీసులు
- మృతదేహం తరలింపుకు ఏర్పాట్లు
ఇక ఇతని గురించిన వివరాలను తమకు తెలియజేస్తే 10 వేల డాలర్ల రివార్డును అందిస్తామని యూఎస్ పోలీసులు ప్రకటించారు. శరత్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, వరంగల్ లో ఉన్న శరత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చౌడవరం రఘు అనే యువకుడు 'క్రౌడ్ ఫండింగ్' ప్రచారాన్ని ప్రారంభించగా, నిన్న ఒక్కరోజులో 45 వేల డాలర్లకు పైగా వసూలయ్యాయి.