law commission: జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలంటూ టీడీపీ నిర్ణయం

  • జమిలి ఎన్నికలపై పార్టీల అభిప్రాయ సేకరణ 
  • అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ
  • సమావేశానికి హాజరవుతున్న పలు పార్టీలు

కీలకమైన జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను టీడీపీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం... ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతుండటాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి.

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు హాజరవుతున్నాయి. ఈ సందర్భంగా లా కమిషన్ ఎదుట జమిలి ఎన్నికలకు సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. దీని కోసం పార్టీలకు నేడు, రేపు సమయాన్ని కమిషన్ కేటాయించింది. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కమిషన్ తీసుకోనుంది. 

More Telugu News