Chandrababu: చంద్రబాబు సమర్థవంతమైన అవినీతి పాలన చేస్తున్నారు: సోము వీర్రాజు సెటైర్

  • ఇళ్ల నిర్మాణంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగింది
  • నీరు, చెట్టు కార్యక్రమంలో వేలాది కోట్ల అవినీతి
  • అప్పులు చేస్తూ, ప్రజలపై భారం మోపుతున్నారు

చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని... సమర్థవంతమైన అవినీతి పాలన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. సమర్థవంతంగా అవినీతిని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు కేటాయిస్తే... రాష్ట్ర ప్రభుత్వం రూ. 1400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్న ఇళ్ల సంఖ్యకు, నిర్మించినవాటికి పొంతన లేకుండా ఉందని అన్నారు. అవసరం లేకున్నా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారని... ప్రజలపై భారం మోపుతున్నారని తెలిపారు.

ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 1.50 లక్షలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తోందని వీర్రాజు చెప్పారు. ఒక ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు సరిపోతాయని... కేంద్ర, రాష్ట్ర నిధులు రూ. 2.50 లక్షలు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2.65 లక్షలు అప్పు చేస్తోందని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. నీరు, చెట్టు కార్యక్రమంలో కూడా వేలాది కోట్ల అవినీతి చోటు చేసుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News