karthi: రైతు సమస్యలపై పోరాటం .. రైతు పాత్రలో కార్తీ

  • తమిళంలో 'కడైకుట్టి సింగం'
  • తెలుగు టైటిల్ గా 'చినబాబు'
  • కార్తీ జోడీగా సాయేషా సైగల్

తమిళంలో వరుస సినిమాలు చేస్తూ .. తెలుగులోను అవి విడుదలయ్యేలా చూస్తూ కార్తీ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'కడైకుట్టి సింగం' సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సూర్య సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. పల్లెటూరి నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతుల జీవితాల నేపథ్యంలో కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో ఓ రైతుగా కార్తీ కనిపించనున్నాడు .. రైతుగానే పోరాటాన్ని కొనసాగించనున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోన్న మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 

More Telugu News