janasena: విశాఖ తీరాన భారీ కవాతు.. వేలాదిగా తరలి రండి: జనసేన

  • మరో భారీ కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన
  • విశాఖ బీచ్ రోడ్డులో నిరసన కవాతు
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభం

గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలను ఉద్ధృతం చేసిన జనసేన... విశాఖలో మరో భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన హామీల అమలు కోసం భారీ నిరసన కవాతును నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ సముద్ర తీరాన ఈ నిరసన కవాతు జరగనుంది. అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి బీచ్ రోడ్ లోని కాళికా మందిరం వరకు కవాతు కొనసాగనుంది. జనసైనికులు వేలాదిగా తరలి వచ్చి, కవాతులో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ పిలుపునిచ్చింది. 

  • Loading...

More Telugu News