gopichand: ఆశ్చర్యపరుస్తోన్న 'పంతం' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'పంతం' 
  • గోపీచంద్ యాక్షన్ హైలైట్
  • మెహ్రీన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ

చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన 'పంతం' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ .. ఎమోషన్ తో పాటు మంచి మెసేజ్ తో కూడి ఉండటం వలన, ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. తొలిరోజు వసూళ్లే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 5.2 కోట్ల గ్రాస్ ను .. 3.22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. చాలా గ్యాప్ తరువాత గోపీచంద్ నటనను పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రంగా 'పంతం' గురించి చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి తొలిరోజునే ఈ స్థాయి వసూళ్లు లభించడం విశేషంగా చెబుతున్నారు. గోపీచంద్ యాక్షన్ .. మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ కొంతకాలంగా ఎదురుచూస్తోన్న హిట్ ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.       

More Telugu News