Jagan: జగన్ ని సీఎం చేసేందుకు ఎవరితోనైనా సరే కలిసి పనిచేస్తా: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

  • ఈ నెల 7న వైసీపీలో చేరనున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
  • జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
  • చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కుమారుడు సిద్ధార్థరెడ్డి  ఈ నెల 7న వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ లో సిద్ధార్థరెడ్డి చేరనున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ,  జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఆయన్ని సీఎం చేసేందుకు ఎవరితోనైనా సరే కలిసి పనిచేస్తానని చెప్పారు.

తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కర్నూలు జిల్లా నందికొట్కూరులో  అవినీతి పెరిగిపోయిందని ఆరోపించిన సిద్ధార్థరెడ్డి, తనపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.

More Telugu News