kavali: కావలిలో కన్నాకు చేదు అనుభవం!

  • కావలిలో బీజేపీ ర్యాలీ 
  • కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తి
  • పోలీసుల అదుపులో నిందితుడు

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో నిర్వహిస్తున్న బీజేపీ ర్యాలీలో పాల్గొన్న కన్నాపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతని పేరు గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అని, అతని స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు అని పోలీసులు చెప్పారు. కాగా, టీడీపీపైన, ఆ పార్టీ నేతలపైన బీజేపీ నాయకులు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కన్నా తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News