ntr national awards: ఈ నెల 6న కన్నడ ప్రముఖులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు

  • 2018 ఎన్టీఆర్ జాతీయ పురస్కారాల ప్రకటన
  • సంగీత దర్శకుడు హంసలేఖ, నాటక రంగ కళాకారిణి అరుంధతినాగ్ ఎంపిక
  • బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరగనున్న వేడుక

2018 సంవత్సరానికి గాను కన్నడ ప్రముఖులను ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, సాహితీవేత్త హంసలేఖను, ప్రఖ్యాత నాటక రంగ కళాకారిణి అరుంధతినాగ్ లను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్.వి.హరీశ్, ప్రధాన కార్యదర్శి సి.వి. శ్రీనివాసయ్య ఈ మేరకు బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు స్థానిక రవీంద్ర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకుని ఈ పురస్కారాలను అందజేయనున్నారు. 

More Telugu News