bellamkonda srinivas: అమాయక చక్రవర్తిగా కనిపించనున్న యంగ్ హీరో

  • విడుదలకి సిద్ధంగా 'సాక్ష్యం'
  • నెక్స్ట్ మూవీ తేజ దర్శకత్వంలో 
  • ఈ నెల 9వ తేదీ నుంచి మొదలు  

'అల్లుడు శీను' .. 'జయ జానకి నాయక' సినిమాలతో మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, త్వరలో 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు తేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అమాయక చక్రవర్తిలా కనిపిస్తాడట. 'చంటి'లో వెంకటేశ్ పాత్ర తరహాలో ఆయన పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

 ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆయన, ఈ సారి ప్రేక్షకుల ముందుకు విభిన్నంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ కథకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ నటించనుండగా, మరో ముఖ్యమైన పాత్రలో సోనూసూద్ కనిపించనున్నాడు.    

More Telugu News