venkatesh: మల్టీ స్టారర్ మూవీ ప్రారంభానికి ముహూర్తం కుదిరినట్టే!

  • బాబీ నుంచి మల్టీ స్టారర్ మూవీ 
  • హీరోలుగా వెంకీ .. చైతూ 
  • ఈ నెల 11వ తేదీన ప్రారంభం

ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' చేసి హిట్ కొట్టిన బాబీ .. ఇప్పుడు మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒక కథానాయకుడిగా వెంకటేశ్ .. మరో కథానాయకుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి .. నాగచైతన్య జోడీగా రకుల్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందనే టాక్ వినిపిస్తోంది. వెంకటేశ్ .. చైతూ పాత్రలు కొత్తగా ఉంటాయనీ, వాళ్ల కెరియర్లో ఇదొక విభిన్నమైన సినిమా అవుతుందని బాబీ చెబుతున్నాడు. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నాడు. దసరాకి గానీ .. దీపావళికి గాని ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.    

More Telugu News