Laloo Prasad: అంతా సీఎం నితీష్ కుట్రే... నా ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసి పోస్టులు పెడుతున్నారు: తేజ్ ప్రతాప్ యాదవ్

  • కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు
  • ఐకమత్యంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఓడిస్తాం
  • లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్

తన ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేయించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఆయన ఫేస్ బుక్ పేజీలో బీహార్ మాజీ సీఎం, తన తల్లి రబ్రీదేవి లక్ష్యంగా చేసిన పోస్టు కలకలం రేపగా, తేజ్ ప్రతాప్ వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సభ్యులు తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారని, తన కుటుంబంలో ఎటువంటి వివాదాలూ లేవని అన్నారు. "మా కుటుంబంలో ఎటువంటి విభేదాలూ లేవు. మేము ఐకమత్యంతో ఉన్నాము. 2019 ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ఓడించనున్నాము. నా ఖాతాను హ్యాక్ చేసి తప్పుడు పోస్టులు పెడుతున్నారు" అని ఆయన ఆరోపించారు.

ఆపై ఫేస్ బుక్ లో అంతకుముందున్న పోస్టు మాయం కాగా, మరో పోస్టు ప్రత్యక్షమైంది. "స్నేహితులా... అంకుల్ నితీశ్ కుమార్ మరోసారి మనల్ని విడగొట్టాలని చూశారు. సాయంత్రం నా ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసి ఓ పోస్టు పెట్టి మన కుటుంబాన్ని బద్దలు కొట్టాలని చూశారు. నా కుటుంబమే నా జీవితం. నా సోదరుడే నా బలం" అన్న పోస్టు కనిపిస్తోంది.

More Telugu News