telangana: 5న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

  • విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్ కు పిలుపు
  • పోస్టర్ ను విడుదల చేసిన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
  • సమస్యలను పరిష్కరించకపోతే.. పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరిక

ఈ నెల 5వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి బంద్ పాటించబోతున్నట్టు కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐడీఎస్ఓ, టీవీవీ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీలు ఐక్య కార్యాచరణ కమిటీ పోస్టర్ ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా కమిటీ నేతలు మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

More Telugu News