Hyderabad: హైదరాబాద్ లో క్రాస్ మసాజ్.. నలుగురి అరెస్ట్

  • అబిడ్స్ లో బట్టబయలైన క్రాస్ మసాజ్ భాగోతం
  • పక్కా సమాచారంతో దాడి చేసిన టాస్క్ ఫోర్స్
  • నిర్వాహకురాలు సహా నలుగురి అరెస్ట్

హైదరాబాద్ అబిడ్స్ లోని చిరాగ్ అలీ లేన్ లో నిర్వహిస్తున్న నేచురల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ లో క్రాస్ మసాజ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో... టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.ఈ సందర్భంగా స్పా నిర్వాహకురాలు జ్యోతి అలియాస్ రాధారెడ్డి (49)తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తానే ఈ సెంటర్ ను నిర్వహిస్తున్నట్టు విచారణలో జ్యోతి తెలిపింది.

గతంలోనే జ్యోతిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. 2015లో వైఎంసీఏ, నారాయణగూడల్లో స్ప్లాష్ బ్యూటీ సెలూన్ పేరుతో ఆమె మసాజ్ సెంటర్లను నిర్వహించింది. నెల రోజుల క్రితం అబిడ్స్ కు మకాం మార్చింది. క్రాస్ మసాజ్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తూ, బిజినెస్ చేస్తోంది. ఇద్దరు యువతులను బ్యూటీషియన్లుగా నియమించుకుంది. ఒక్కో కస్టమర్ నుంచి రూ. 2వేలు తీసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News