railway zone: రైల్వే జోన్ల కోసం పలు డిమాండ్లు.. అద్వానీ, గడ్కరీ, యోగి, సచిన్ కూడా డిమాండ్ చేశారు!

  • గత మూడేళ్లలో 174 మంది ప్రముఖుల డిమాండ్
  • ముంబై సబర్బన్ రైల్వే జోన్ ను డిమాండ్ చేసిన సచిన్
  • గుజరాత్ లో కొత్త రైల్వే జోన్ కోరిన అద్వానీ 

విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైల్వే జోన్ కోసం ఏపీ వాసులు మాత్రమే కాదు... దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు కూడా తమ తమ ప్రాంతాల్లో రైల్వే జోన్ ల కోసం డిమాండ్ చేశారు. ఈ మూడేళ్ల కాలంలోనే ఏకంగా 174 మంది తమ ప్రాంతాల్లో రైల్వే జోన్లు, రైల్వే డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వీరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తదితరులు ఉన్నారు.

సచిన్ ముంబై సబర్బన్ రైల్వే జోన్ ను, అద్వానీ గుజరాత్ లో కొత్త రైల్వే జోన్, యోగి గోరఖ్ పూర్ రైల్వే డివిజన్, గడ్కరీ నాగపూర్ రైల్వే జోన్, శశిథరూర్ తిరువనంతపురం రైల్వే జోన్, కానూర్ రైల్వే డివిజన్ లను డిమాండ్ చేశారు.

More Telugu News