kidnappers: పిల్లలను ఎత్తుకుపోయేవారనే అనుమానంతో.. ఐదుగురిని కొట్టి చంపిన వైనం!

  • మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దారుణం
  • గ్రామంలోకి వచ్చిన ఐదుగురు కొత్త వ్యక్తులు
  • ఓ చిన్నారితో మాట్లాడటంతో.. చితకబాది, చంపేసిన వైనం

గ్రామంలోకి అడుగుపెట్టిన ఐదుగురు కొత్త వ్యక్తులను కొట్టి చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నారులను ఎత్తుకుపోయేవారనే అనుమానంతో ఈ దారుణానికి తెగబడ్డారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు గిరిజన తండా అయిన రయిన్ పడాలో దిగారు. అదే సమయంలో ప్రతి ఆదివారం జరిగే విధంగానే అక్కడ సంత జరుగుతోంది.

బస్సు దిగిన ఆ కొత్త వ్యక్తులు ఓ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని కిడ్నాపర్లుగా అనుమానించిన స్థానికులు మూకుమ్మడిగా వారిపై దాడి చేసి, చావబాదారు. ఈ ఘటనలో ఆ ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, చిన్న పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయనే పుకార్లు గత కొన్ని వారాలుగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. ఈ భయాందోళనలతోనే స్థానికులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. మృతదేహాలను సమీపంలోని పింపల్నేర్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కేసు నమోదు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News