Jagapati Babu: దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథాంశంతో రూపొందిన 'ఆటగాళ్లు'!

  • నారా రోహిత్, జగపతిబాబు నటించిన మల్టీస్టారర్
  • థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన 'ఆటగాళ్లు'
  • ప్రేక్షకులకు నచ్చుతుందన్న జగపతిబాబు

ఒక దర్శకుడు ఉన్నాడు. అతను లవ్ స్టోరీస్ ను సినిమాగా మలచి హిట్ సాధించడంలో నేర్పరి. తన తెలివితేటలతో ఓ అమ్మాయిని లవ్ లో పడేశాడు. ఇద్దరూ వివాహం చేసుకుని అన్యోన్యంగా ఉన్న సమయంలో ఆమె దారుణ హత్యకు గురి అయింది. ఆ నేరం దర్శకుడిపై పడింది. ఇక ఆ హత్యను ఎవరు చేశారు? ఆమె హత్యలో దర్శకుడి పాత్ర ఎంత?... చదివితే ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ స్టోరీ లైన్ 'ఆటగాళ్లు' సినిమా కథ.

విలక్షణ నటుడు జగపతిబాబు, నారా రోహిత్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం. దీనికి పరుచూరు మురళి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శేఖర్ కమ్ముల విడుదల చేయగా, జగపతిబాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ఓ థ్రిల్లర్ కథాంశమని, హత్య చుట్టూ తిరుగుతుందని, దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథ ప్రేక్షకులను కట్టి పడేస్తుందని చెప్పాడు. మరి అసలు విషయం తెలియాలంటే, సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

More Telugu News