India: దటీజ్ ధోనీ... భేషజాలకు పోకుండా ఆటగాళ్లకు నీళ్లు మోసుకొచ్చాడు!

  • అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ధోనీ
  • రాహుల్‌, రైనాలకు మంచి నీళ్లు ఇచ్చిన వైనం
  • ఐర్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా ఘటన

సమకాలీన ప్రపంచ క్రికెట్ చరిత్రలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఏ మాత్రం భేషజాలకు పోని తనలోని నైజాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. నామోషీ లేకుండా మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్ల సీసాలు మోసుకుని వెళ్లాడు. ఐర్లాండ్‌ తో జరిగిన రెండో టీ-20 సందర్భంగా ఈ దృశ్యం కనిపించగా, ధోనీ గొప్పతనాన్ని క్రికెట్ అభిమానులు పొగుడుతున్నారు.

ఈ మ్యాచ్ లో ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించగా, ఆ జాబితాలో ధోనీ కూడా ఉన్నాడు. అదనపు ఆటగాడిగా డగ్గౌట్ లో ఉన్న ధోని, ఊరికే కూర్చోకుండా, రాహుల్‌, రైనా బ్యాటింగ్‌ చేస్తున్న వేళ, మైదానంలోకి నీళ్ల సీసాలను తీసుకెళ్లి ఇచ్చాడు. ధోనీలోని సింప్లిసిటీకి ఈ ఘటన ద్వారా మంచి మార్కులే పడ్డాయి.

More Telugu News