father: రహస్యంగా ఫోనులో అబ్బాయితో మాట్లాడుతోందని.. కూతురిని కొట్టి హత్య చేసిన తండ్రి!

  • కృష్ణా జిల్లాలో ఘటన
  • కూతురిపై అనుమానం
  • ఎవరినో ప్రేమిస్తోందని ఆగ్రహం

తన కూతురు ఓ అబ్బాయితో ఫోనులో మాట్లాడుతోందన్న అనుమానంతో తండ్రి ఆమెను దారుణంగా కొట్టి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో నివసించే కోటయ్య తన కుమార్తె ప్రవర్తన పట్ల అనుమానంతో ఉండేవాడు. తన కూతురు ఓ అబ్బాయిని ప్రేమిస్తోందని భావిస్తున్నాడు.

దీంతో ఆమె ఫోనులో మాట్లాడుతుండగా చూసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ అమ్మాయి (24) బీటెక్‌ విద్యార్థని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.                

  • Loading...

More Telugu News