Chandrababu: మీరన్నా ప్రధానిగా ఉండండి.. లేదంటే ఓ దళితుడిని చేయండి: చంద్రబాబుతో వర్ల రామయ్య

  • ప్రతి 15 నిమిషాలకి మా దళితుల మీద దాడులు
  • దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు
  • మోదీ, షాల మీద పోరాటం చేయడానికి పూనుకున్నారు
  • మా ఆవేదనను దృష్టిలో పెట్టుకోండి

దేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాల జోడీ ఉందని, వారి అసమర్థ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ప్రతి 15 నిమిషాలకి దళితుల మీద దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. నెల్లూరులో దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... "ప్రతిరోజు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మోదీ, అమిత్‌ షాల మీద పోరాటం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారు.

మా ఆవేదనను దృష్టిలో పెట్టుకోండి. అప్పట్లో జగ్జీవన్‌ రామ్‌ని ప్రధాని కాకుండా అడ్డుకున్నారు. అప్పట్లో మీలాంటి (చంద్రబాబు లాంటి) నాయకుడు ఉంటే అప్పట్లోనే ఓ దళితుడు ప్రధానమంత్రి అయ్యుండేవారు. మీ హయాంలోనే ఓ దళితుడు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి. మీరు ప్రధానిగా ఉంటారా? మాకు సంతోషం.. మీరు దేశానికి నాయకత్వం వహిస్తారా? మాకు సంతోషం.. లేదంటే దళిత నాయకత్వాన్ని దేశ అత్యున్నత స్థాయిలో నిలపాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.     

More Telugu News